శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 25 జూన్ 2016 (13:16 IST)

పదేళ్ళుగా ఆదర్శ దంపతులు.. ఉన్నట్టుండి విడిపోవాలనుకుంటున్నారు... ఎందుకు?

సినీ పరిశ్రమలో జంటలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. గాఢంగా ప్రేమించి పెళ్లికి ముందే విడిపోతున్న వారు కొందరైతే, పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోతున్న వారు మరికొందరు. తాజాగా ఈ విడిపోయిన జం

సినీ పరిశ్రమలో జంటలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. గాఢంగా ప్రేమించి పెళ్లికి ముందే విడిపోతున్న వారు కొందరైతే, పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోతున్న వారు మరికొందరు. తాజాగా ఈ విడిపోయిన జంటల జాబితాలో మళయాళీ భామ కళ్యాణి, దర్శకుడు సూర్య కిరణ్ జంట కూడా చేరిపోయింది. రాజశేఖర్ సినిమా ''శేషు''తో కళ్యాణి టాలీవుడ్‌కి పరిచయమైంది. ఆ తర్వాత వరుస హిట్లతో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. 
 
క్రమంగా జగపతిబాబు, రవితేజ, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అవకాశాలు తగ్గగానే దర్శకుడు సూర్య కిరణ్‌ని ప్రేమించి పదేళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. అయితే ఈ జంట మధ్య ఇటీవల మనస్పర్థలు చోటుచేసుకున్నాయట. వీటి కారణంగానే వారిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారని, విడాకులకు సిద్ధం అయ్యారని మాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
ఆదర్శ దంపతులకుగా పేరు సంపాదించుకుని ఇప్పటివరకూ గుట్టుచప్పుడు కాకుండా ఉన్న ఈ జంట ఒక్కసారిగా విడాకుల నిర్ణయం తీసుకోవడంతో ఇటు టాలీవుడ్.. అటు మాలీవుడ్ వర్గాలు ఆశ్యర్యానికి గురవుతుంది. ఏది ఏమైనా ఇన్నాళ్లు అన్యోన్యంగా కలిసి ఉన్న జంట విడిపోతుందన్న వార్త ప్రేక్షకులను కలవర పెడుతోంది.