1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (16:49 IST)

ఫ్రైడ్ రైస్‌లో చచ్చిన బొద్దింక ... ఫోటోతో షేర్ చేసిన నివేదా పేతురాజ్

అనేక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఆ రెస్టారెంట్లు తయారు చేసే ఆహార నాణ్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తాజాగా ఓ రెస్టారెంట్‌ సరఫరా చేసిన ఫుడ్‌లో చచ్చిన బొద్దింక కనిపించింది. దీంతో ఆ కష్టమర్ షాక్‌కు గురయ్యారు. ఆ కష్టమరో ఎవరో కాదు... హీరోయిన్ నివేదా పేతురాజ్. 
 
ఆమె ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్‌లో బొద్దింక ఉండటంతో రెస్టారెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదా బుధవారం సాయంత్రం చెన్నైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకుంది. 
 
డెలివరీ బాయ్ తెచ్చిన ఫుడ్ పార్శిల్ తెరవగానే ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు. అందులో ఓ చచ్చిన బొద్దింక దర్శనమిచ్చింది. దాంతో నివేదా మండిపడ్డారు. సదరు రెస్టారెంట్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఇలాంటి రెస్టారెంట్లకు భారీ జరిమానా వడ్డించాలని డిమాండ్ చేశారు. వాళ్లు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని విమర్శించారు. ఫ్రైడ్ రైస్‌లో వచ్చిన బొద్దింక ఫొటోను కూడా నివేదా సోషల్ మీడియాలో పంచుకున్నారు.