శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 16 జనవరి 2019 (13:41 IST)

స్కూల్‌లో పరిచయమైన వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ : 'మిర్చి' పిల్ల వెల్లడి

'లీడర్' చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన భామ రిచా గంగోపాధ్యాయ. రానా హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం రాగా, సూపర్ డూపర్ హిట్ అయింది. తన తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రిచా... ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన "మిర్చి", రవితేజ నటించిన "మిరపకాయ్" వంటి చిత్రాల్లో నటించింది. 
 
పైగా, కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగానే ఆమె ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లింది. అక్కడ బిజినెస్‌ స్కూల్‌లో జోయ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. గత రెండేళ్లుగా కొనసాగిన వీరి ప్రేమ పెళ్లికి దారితీసింది. దీంతో ఇటీవలే నిశ్చితార్థం జరిగినట్టు రిచా వెల్లడించింది. అయితే, పెళ్లి తేదీలను మాత్రం ఇంకా ఖరారు చేయలేదని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. కాగా, 
 
ప్రస్తుతానికి పెళ్లికి ముహూర్తం నిర్ణయించలేదని, జీవితంలో కొత్త మార్పుకోసం ఆనందంగా ఎదురుచూస్తున్నట్టుగా రిచా తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, బెంగాళీ చిత్రాల్లోనూ నటించిన రిచా గంగోపాధ్యాయ సైమా వేడుకల్లో ఉత్తమ నటి (క్రిటిక్స్‌ ఛాయిస్‌) అవార్డును అందుకున్నారు.