శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 22 జూన్ 2018 (17:53 IST)

మగాళ్ళ మధ్యే "స్వ‌యంతృప్తి" సీన్‌లో నటించా... అదో ఎక్స్‌పీరియన్స్ : కైరా అద్వానీ (Video)

గతంలో వచ్చిన 'ధోనీ' బయోపిక్, తాజాగా మహేష్ బాబు చిత్రం 'భరత్ అనే నేను' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ కైరా అద్వానీ. ఈమె ఓ బాలీవుడ్ చిత్రంలో కూడా నటించింది. ఆ చిత్రం పేరు "లస్ట్ స్

గతంలో వచ్చిన 'ధోనీ' బయోపిక్, తాజాగా మహేష్ బాబు చిత్రం 'భరత్ అనే నేను' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ కైరా అద్వానీ. ఈమె ఓ బాలీవుడ్ చిత్రంలో కూడా నటించింది. ఆ చిత్రం పేరు "లస్ట్ స్టోరీస్". ఇందులో ఆమె బోల్డ్ క్యారెక్టర్‌లో నటించి, ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది.
 
ముఖ్యంగా, బిడియ‌స్తుడైన భ‌ర్త‌కు భార్య‌గా, శృంగార కోరిక‌లు ఎక్కువ‌గా గ‌ల గృహిణి పాత్ర‌లో కియారా న‌టించింది. పాత్ర ప‌రిధి దృష్ట్యా కొన్ని హాట్ సన్నివేశాల్లో కియారా న‌టించింది. ముఖ్యంగా 'స్వ‌యంతృప్తి' వంటి బోల్డ్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందన్నారు. 
 
"ఇది పూర్తిగా పెద్ద‌ల కోసం తీసిన సినిమా. మొద‌ట నాకు స్క్రిప్టు చెప్పిన‌ప్పుడు ఈ సీన్ లేదు. షూటింగ్ స‌మ‌యంలో ఈ సీన్ యాడ్ చేశారు. ఆ సీన్ చేస్తేనే స‌బ్జెక్ట్‌కు న్యాయం చేసిన‌ట్టు అవుతుంద‌ని నాకు అనిపించింది. చిత్ర‌బృందం చాలా స‌హ‌క‌రించింది కాబ‌ట్టే.. ఎంతో మంది మ‌గాళ్లు ఉండ‌గా ఆ సీన్‌లో న‌టించాను. ఆ సీన్ చేసినందుకు నేను ప‌శ్చాత్తాపం చెంద‌డం లేద"ని అదో కొత్త అనుభూతిగా భావిస్తున్నట్టు చెప్పింది. 
 
కాగా, ఇటీవల వచ్చిన 'వీరే ది వెడ్డింగ్' సినిమాలో స్వ‌ర‌భాస్క‌ర్ కూడా ఇలాంటి సీన్‌లో న‌టించి విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. తాజాగా కియారాకు కూడా విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి.