ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 30 మార్చి 2019 (09:36 IST)

నిర్మాతకు డబ్బులు ఎగ్గొట్టి చిక్కుల్లో పడిన అమీషా పటేల్...

నిర్మాతకు చెల్లించాల్సిన డబ్బులు ఎగ్గొట్టిన బాలీవుడ్ నటి అమీషా పటేల్ చిక్కుల్లో పడింది. నిర్మాత అజయ్ కుమార్‌కు ఈమె కొంత నగదు ఇవ్వాల్సి వుంది. ఇందుకోసం చెక్‌ ఇచ్చింది. కానీ, బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయింది. అలా ఆయన్ను మోసం చేసింది. దీంతో అజయ్ కుమార్ రాంచీ కోర్టులో ఫిర్యాదు చేశారు. 
 
గత యేడాది మార్చిలో రాంచీలో ఓ ఈవెంట్‌కి హాజరైన అమీషా పటేల్, ఆమె బిజినెస్ పార్టనర్ కున్నాల్ గ్రూమర్ తన దగ్గర రూ.2.5 కోట్లు అప్పుగా తీసుకుందని నిర్మాత అజయ్ కుమార్ తెలిపారు. రెండు, మూడు నెలల్లో వడ్డీతో కలిపి చెల్లిస్తామని చెప్పారని హామీ ఇచ్చారు.
 
ఆ తర్వాత 3 కోట్ల రూపాయల చెల్లని చెక్ ఇచ్చారని తెలిపారు. ఆ పిమ్మట వారిని సంప్రదిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదని పేర్కొన్నారు. పైగా, పెద్దపెద్ద బడా నేతల ఫోటోలు చూపించి చంపేస్తానని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. దీన్ని కోర్టు విచారణకు స్వీకరించింది.