శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2016 (16:40 IST)

ఏప్రిల్‌ 28న 'బాహుబలి-2' వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ .. నిర్మాత శోభు యార్లగడ్డ

ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా, రమ్యకష్ణ, నాజర్‌ ప్రధాన తారాగణంగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై శోభుయార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలుగా

ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా, రమ్యకష్ణ, నాజర్‌ ప్రధాన తారాగణంగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై శోభుయార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'బాహుబలి 2'. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ చిత్ర లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్లో శుక్రవారం రాత్రి జరిగింది. 
 
నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ షూటింగ్‌ ప్రకారం చూస్తే సినిమాలో ముఖ్య ఎపిసోడ్స్‌ అన్నీ పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో అంటే అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌లో కొన్ని రోజుల్లో సినిమా చిత్రీకరణ అంతా పూర్తి చేసేస్తాం. కొన్ని సీన్స్‌, సాంగ్స్‌ చిత్రీకరించాల్సి ఉంది. ఏప్రిల్‌ 28న బాహుబలి-2 విడుదల చేయబోతున్నాం. వచ్చే ఏడాది, జనవరిలో సినిమా ట్రైలర్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి'' అన్నారు.