బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (11:31 IST)

'పెళ్లి చేసుకున్నంత మాత్రాన పిల్ల‌ల్ని క‌నెయ్యాలా'? ప్రశ్నిస్తున్న నటి

వివాదాస్పద బాలీవుడ్ నటీమణుల్లో బిపాసా బసు ఒకరు. ఈ హాట్ యాంకర్ చేసే ప్రతిపనీ, చేసే ప్రతి వ్యాఖ్యా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు మరోమారు చర్చకు దారితీశాయి. 'పెళ్లి చేసు

వివాదాస్పద బాలీవుడ్ నటీమణుల్లో బిపాసా బసు ఒకరు. ఈ హాట్ యాంకర్ చేసే ప్రతిపనీ, చేసే ప్రతి వ్యాఖ్యా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు మరోమారు చర్చకు దారితీశాయి. 'పెళ్లి చేసుకున్నంత మాత్రాన పిల్ల‌ల్ని క‌నెయ్యాలా'? అంటూ ప్రశ్నించింది. 
 
నిజానికి బిపాసా బ‌సు, క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌ను పెళ్లాడి వ‌చ్చే నెల‌తో రెండేళ్లు పూర్తికానున్నాయి. ఈ రెండేళ్లుగా బిపాసా వైవాహిక జీవితాన్ని ఎంత‌గా ఆస్వాదించిందో సోష‌ల్ మీడియా ద్వారా చెబుతూనే ఉంది. భ‌ర్త‌తో వెకేష‌న్‌కు ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లిన‌పుడు తీసుకున్న ఫోటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్‌మీడియాలో అప్‌లోడ్ చేస్తూ త‌న సంతోషాన్ని పంచుకుంటుంటుంది.
 
గత యేడాది ఓ ఆస్పత్రి వద్ద ఆమె కనిపించడంతో ఆమె గర్భందాల్చిందనే వార్త చక్కర్లు కొట్టింది. ఇపుడు ఓ ఈవెంట్‌కు హాజ‌రైన బిపాసాను ఓ విలేకరి అడిగిన ప్రశ్నతో ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఇది చాలా హాస్యాస్ప‌దంగా ఉంది. తల్లి కావ‌డం త‌ప్ప ఓ మ‌హిళ‌కు త‌న జీవితంలో ఇంకేమి ఉండ‌దా? ఓ మ‌హిళా నిజంగా ఇది విచారించ‌వ‌ల‌సిన విష‌యం. త‌ల్లి కావ‌డం ఏ మ‌హిళ‌కైనా గొప్ప అనుభూతే. అయితే ఓ మ‌హిళ జీవితంలో ఇంకా చాలా ఉంటాయి. కేవ‌లం పెళ్లి చేసుకున్నంత మాత్రాన పిల్ల‌ల్ని క‌నెయ్యాలా' అంటూ బిపాసా ప్రశ్నించింది.