ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 30 మార్చి 2019 (09:45 IST)

దక్షిణాదిపై కన్నేసిన అలియా... రాజమౌళి చిత్రంపైనే ఆశలు

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నిర్మిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". 'బాహుబలి' తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ చిత్రంలో హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్లుగా బాలీవుడ్ నటి అలియా భట్, బ్రిటన్ నటి ఎడ్గర్ జోన్స్ నటిస్తోంది. 
 
రూ.300 కోట్ల వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్‌లో హీరోయిన్లు ఏప్రిల్ నుంచి పాల్గొనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రాజస్థాన్ రాష్ట్రంలో షూటింగ్ జరుపుకుంటోది. 45 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలు తెరకెక్కనున్నాయి. ఈ షెడ్యూల్‌లోనే అలియా కూడా పాల్గొనబోతుంది. అయితే ఆర్ఆర్ఆర్‌లో అలియా సీత అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నట్టు సమాచారం. 
 
అలియా భట్‌కు తెలుగులో ఇదే తొలి చిత్రం. పైగా, తన మొదటి సినిమాతోనే రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో ఆలియాకి సౌత్‌లో క్రేజ్ పెరగనుంది. భవిష్యత్‌లో సౌత్‌పై దృష్టిపెట్టి.. తన సినీ కెరీర్‌ను మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకోవాలని ఆమె భావిస్తోంది.