ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 13 జులై 2020 (22:59 IST)

అందరూ కరోనాతో చనిపోతుంటే ఆ హీరోయిన్ ఆ వ్యాధితో మరణించింది

ఇప్పుడు ఎవరు చనిపోయినా కరోనానే అని బాగానే ప్రచారం చేసేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఎవరు చనిపోయినా ఇదే పరిస్థితి. ఇదే రకరమైన ప్రచారం జరుగుతోంది. అయితే సినీనటి, ప్రముఖ మోడల్ దివ్య చౌక్సీ మరణం మాత్రం బాలీవుడ్‌ను తీవ్ర విషాదంలోకి తీసుకెళ్ళిపోయింది. 
 
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువనటి మరణించడంతో సినీ పరిశ్రమ మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. దివ్య చౌక్సీ పలు టెలివిజన్ సీరియల్స్‌లో అద్భుతమైన ప్రతిభను చాటింది. అలాగే హిందీ ప్రేక్షకులందరికీ సుపరిచితురాలు. నటిగానే కాకుండా పలు వ్యాపార ప్రకటనల్లో నటించింది. 
 
హై అప్పా దిల్‌తో ఆవారా అనే చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే 2018 సంవత్సరంలో పాటియాలే ది క్వీన్ అంటూ సింగర్‌గా మారారు. లండన్‌లో యాక్టింగ్ నేర్చుకున్న దివ్య గత కొన్ని నెలలుగా అనారోగ్యానికి గురయ్యారు.
 
అనారోగ్యంగా ఉన్నట్లు తానే స్వయంగా ఒక ట్వీట్ కూడా చేశారు. నేను ప్రస్తుతం బెడ్ మీద ఉన్నాను. క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. తిరిగిమీ దగ్గరకు వస్తానన్న నమ్మకం కూడా నాకు తగ్గుతోంది. కానీ మీ అభిమానం నన్ను బతికిస్తుందని నమ్ముతానని సందేశం పంపింది. కానీ చివరకు చికిత్స పొందుతూ తిరిగి రాని లోకాలకు ఆమె వెళ్లిపోయింది. దివ్య మరణంపై పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.