శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (17:14 IST)

చిరంజీవి - పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ ఫిల్మ్ ‌.. మాటల మాంత్రికుడి దర్శకత్వంలో...

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చిత్రం నిర్మితంకానుంది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథను సిద్ధం చేసినట్టు సమాచారం. వారిద్దరి ఇమేజ్‌కు, భావాలకు అనుగుణంగా ఈ

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చిత్రం నిర్మితంకానుంది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథను సిద్ధం చేసినట్టు సమాచారం. వారిద్దరి ఇమేజ్‌కు, భావాలకు అనుగుణంగా ఈ కథను తయారు చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి చిరు-పవన్‌ కలిసి నటిస్తే చూడాలని ఆశిస్తున్న ప్రేక్షకుల చిరకాల కోరిక నెరవేరనుంది. ఈ కల ఇపుడు నెరవేరనుంది. వాస్తవానికి గతంలో "శంకర్‌దాదా జిందాబాద్" చిత్రంలో చిరంజీవి - పవన్ కళ్యాణ్‌లు కలిసి ఓ సన్నివేశంలో కనిపించి ఫ్యాన్స్‌ను ఆలరించారు. 
 
అయితే, చిరంజీవి తాజాగా నటించిన 'ఖైదీ నంబర్ 150'వ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి చిరంజీవి, పవన్‌లతో ఓ మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేయనున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకారంగానే ఆయన ఈ ప్రాజెక్టు గురించి గురువారం అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిరు, పవన్‌లతో సినిమా చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో సుబ్బరామిరెడ్డి 'జీవనపోరాటం'(1986), 'స్టేట్‌‌రౌడీ'(1989), 'గ్యాంగ్‌ మాస్టర్'‌(1994), భగవద్గీత(1993) చిత్రాలను నిర్మించారు.