శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2017 (06:54 IST)

వైజాగ్‌లో చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' థ్యాంక్స్ మీట్... పర్మిషన్ లభించేనా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సంక్రాంతికి విడుదలైన కలెక్షన్ల కుమ్మేస్తోంది. ఫలితంగా కేవలం ఏడు (అతితక్కువ) రోజుల్లో రూ.వంద కోట్ల క్లబ్బులో చేరిపోయిన చిత్రంగా రికార్

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సంక్రాంతికి విడుదలైన కలెక్షన్ల కుమ్మేస్తోంది. ఫలితంగా కేవలం ఏడు (అతితక్కువ) రోజుల్లో రూ.వంద కోట్ల క్లబ్బులో చేరిపోయిన చిత్రంగా రికార్డు సాధించింది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా ప్రకటించారు. ఖైదీ చిత్రానికి ఘన విజయాన్ని అందించిన అభిమానులకి కృతజ్ఞలు తెలిపేందుకు ప్రత్యేకంగా కృతజ్ఞాభినందన (థ్యాంక్స్ మీట్) సభ ఏర్పాటు చేయనున్నట్టు అరవింద్ వెల్లడించారు. 
 
అయితే, ఈ థ్యాంక్స్ మీట్ ఎక్కడన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. వాస్తవానికి ఖైదీ ప్రీరిలీజ్ వేడుకను విజయవాడలో నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ఏపీ సర్కారు ఒత్తిడితో విజయవాడ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో గుంటూరులోని హాయ్‌లాండ్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇపుడు కూడా వైజాగ్‌లో అనుమతి లభిస్తుందా అనే ధర్మసందేహం ఉత్పన్నమైంది. 
 
ఈ నేపథ్యంలో థ్యాంక్స్ మీట్ ఎక్కడన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. మెగా కాంపౌడ్ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈ థ్యాంక్స్ మీట్... వైజాగ్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. గతంలో మెగా హీరోల సక్సెస్ మీట్లన్నీ వైజాగ్‌లో నిర్వహించారు. ఇప్పుడు మెగా ఖైదీ విషయంలోనూ అదే ఫార్ములాని ఫాలో కానున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే మెగా ఖైదీ విజయోత్సవేడుకపై మెగా ఫ్యామిలీ ప్రకటన చేయనుంది.