శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (10:53 IST)

తేజపై క్రిమినల్‌ కేసు.. అప్పట్లో షూటింగ్‌లో కొందర్ని తన్నేవాడు.. ఇప్పుడేం చేశాడో?!

ఇటీవలే దర్శకుడు పూరీ జగన్నాథ్‌... ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లపై కేసుపెట్టాడు. కానీ అది వీగిపోయింది. తాజాగా తెలుగు దర్శకుడు తేజపై క్రిమినల్‌ కేసు నమోదైంది. బంజారా హిల్స్‌కు చెందిన ఆర్‌వి కృష్ణారావు అనే కలపవ్యాపారస్తుడు ఆయనపై కేసు పెట్టినట్లు తెలిసింది. ఓ ఇల్లు కొనుగోలు విషయంలో లావాదేవీల సమయంలో తనను ఇద్దరు వ్యక్తులతో బెదిరించాడనీ. ఆయన కేసు పెట్టాడు. అంతేకాకుండా బెదిరించినట్లు చెబుతున్నాడు. 
 
కాగా, గతంలో తేజపై పలు వివాదాలున్నాయి. షూటింగ్‌లో కొందర్ని తన్నేవాడనీ.. వారు అప్పట్లో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అది వృత్తిపరంగా వచ్చేది గనుక తామేమీ చేయలేదని పోలీసులు వెనుకడుగు వేశారు. అయితే ఈ కేసు ఎటువైపు తిరుగుతుందో చూడాలి.