శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 అక్టోబరు 2016 (13:38 IST)

ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రజినీకాంత్... అల్లుడు - మనువడితో కలిసి దీపావళి

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇటీవల వైద్య పరీక్షలకు అమెరికాకు వెళ్లిన ఆయన.. తన అభిమానులను దీపావళి పండగరోజున కలుసుకోవాలన్న ఉద్దేశంతో సడన్‌గా స్వదేశానికి తిరిగివచ్చేశారు

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇటీవల వైద్య పరీక్షలకు అమెరికాకు వెళ్లిన ఆయన.. తన అభిమానులను దీపావళి పండగరోజున కలుసుకోవాలన్న ఉద్దేశంతో సడన్‌గా స్వదేశానికి తిరిగివచ్చేశారు. 
 
ఆదివారం ఉదయం రజినీకాంత్‌ను పోయస్ గార్డెన్‌లోని ఆయన ఇంట్లో చూసిన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రజినీ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు ఆయన్ను దీపావళి సందర్భంగా శాలువాలతో సన్మానించి ఆనందించారు. 
 
ఈ సందర్భంగా తాజా చిత్రం, రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన 'కబాలీ' 100 రోజుల సెలబ్రేషన్స్‌ను సైతం అభిమానులు సందడిగా జరుపుకున్నారు. వచ్చే సంవత్సరం రోబో సీక్వెల్ '2.0' విజయంతో దీపావళిని జరుపుకుంటామని ఈ సందర్భంగా అభిమానులు తెలిపారు.
 
అంతకుముందు రజినీకాంత్ దీపావళి పండుగను తన అల్లుడు, తమిళ హీరో ధనుష్, మనువడు, కుమార్తె ఐశ్వర్య, సౌందర్యలతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించి ఓ ఫోటోను కూడా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.