శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 27 నవంబరు 2015 (18:36 IST)

దేవిశ్రీ ప్రసాద్ హీరోగా దిల్‌రాజు చిత్రం... సుకుమార్ శిఖరం అంటున్న దేవిశ్రీ

సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దేవిశ్రీప్రసాద్‌ను హీరోగా పరిచయం చేయాలని చాలా రోజులుగా దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ‘కుమారి 21 ఎఫ్’ చిత్ర సక్సెమీట్‌లో దేవిశ్రీప్రసాద్‌ను హీరోగా పరిచయం చేస్తున్నానని ప్రకటించాడు ‘దిల్’ రాజు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ‘దేవిశ్రీ ప్రసాద్‌కు ప్రేక్షకుల్లో ఎంత క్రేజుందో అందరికీ తెలిసిందే. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో ‘నేను నటించదగ్గ కథ కుదిరితే హీరోగా నటిస్తానని’ దేవి చెప్పాడు. అందుకే అతన్ని మా సంస్థ ద్వారా హీరోగా పరిచయం చేయబోతున్నాను. 
 
12 ఏళ్ల క్రితం ‘ఆర్య’తో ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్‌ని అందించిన అదే టీమ్‌తో ఈ సినిమా చేయబోతున్నాను. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించనున్నారు. రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తారు’ అని తెలిపారు. అనంతరం దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ‘నిర్మాతల్లో శిఖరం లాంటి వ్యక్తి దిల్ రాజు, దర్శకుల్లో శిఖరం సుకుమార్, కెమెరామెన్‌లలో శిఖరం రత్నవేలు ఈ ముగ్గురు నన్ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తామని చెప్పడం ఆనందంగా వుంది’ అన్నారు.