గజల్ శ్రీనివాస్, మాధవి లత జంటగా అనుష్ఠానం: 1950లో చలం..?
గజల్ శ్రీనివాస్ వెండితెరపై హీరోగా మెరవనున్నారు. గజల్ గానంతో అందరినీ మెప్పించి.. గజల్నే ఇంటిపేరుగా మార్చుకున్న గజల్ హీరోగా, కృష్ణ వాసా దర్శకత్వంలో 'అనుష్ఠానం' అనే చిత్రం సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కానుంది. ఈ సినిమాలో గజల్ శ్రీనివాస్ సరసన మాధవి లత హీరోయిన్గా నటిస్తోంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా... ప్రముఖ రచయిత చలం 1950లో రచించిన 'అనుష్ఠానం' కథ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. భార్యాభర్తల మధ్య నెలకొనే సున్నిత అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఒకప్పుడు తెలుగు సాహిత్యంలో నవలలు ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేపథ్యంలో.. గజల్ తాజా సినిమాతో నవలా ఆధారిత మూవీ మరిన్ని వచ్చే ఛాన్సుందని సినీ పండితులు అంటున్నారు.
1950 బ్యాక్ డ్రాప్లో రూపొందుకుంటున్న గజల్ అనుష్టానం చిత్రం తప్పకుండా హిట్ అవుతుందని.. దర్శకుడు కృష్ణ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టాకీ పార్ట్ను పూర్తి చేసుకున్న అనుష్టానం సెప్టెంబరులో రిలీజ్ అయ్యే ఛాన్సుంది.