ఒకేచోట రెండు సినిమాలు... రామ్ శివం, హరికథ
రామ్ నటిస్తున్న రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్పై ఉన్నాయి. సురేందర్ రెడ్డి అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న సినిమా 'శివం'. ఇప్పటికే 70 శాతం పూర్తయ్యింది. ఇటీవలే ఊటీ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. కాగా, కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న 'హరికథ' చిత్రం కూడా హైదరాబాద్ షెడ్యూల్ని పూర్తిచేసుకుంది. రామ్ నటిస్తున్న 'శివం', 'హరికథ' సినిమాల లేటెస్ట్ షెడ్యూల్స్ గురువారం నుంచి వైజాగ్లో ప్రారంభం కానున్నాయి.
ఒకేసారి ఒకే ప్లేస్లో జరుగుతున్న ఈ సినిమాల కోసం రామ్ ఇక నుంచి డే అండ్ నైట్ షూటింగ్ చేయనున్నాడు. ఇప్పటికే రెండు టీమ్స్ వైజాగ్ చేరుకున్నాయి. శివంలో రామ్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తుంటే, హరికథ సినిమాలో రామ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలను స్రవింతి మూవీస్ బ్యానర్పై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తుంటే రెండు సినిమాలకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.