శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 4 మే 2016 (13:10 IST)

ఈ జన్మకు హృతిక్‌తో కలిసి జీవించలేను : సుసానే ఖాన్

బాలీవుడ్ ఇండస్ట్రీలో కంగనా రనౌత్, హృతిక్ రోషన్‌ల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిమధ్య తలెత్తిన వివాదం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ, లీగల్ నోటీసులు పంపుకున్న విషయం చివరికి తారాస్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు సెటైర్లు వేయడం మరొకరు దానికి స్పందించడం పరిపాటిగా మారిపోయింది.
 
కంగనా పంపించిన మెయిల్స్‌ను హృతిక్ బయటపెట్టడంతో గొడవ మరింత పెద్దదైంది. దాంతో కంగనా కోపం మరింత ఎక్కువైంది. తన మెయిల్‌ను హ్యాక్ చేసిన తర్వాత, తన పేరుతో ఫేక్ ఈమెయిల్ అకౌంట్ ఉందంటూ హృతిక్ ఫిర్యాదు చేయడంపై కంగనా ప్రశ్నించింది. ఈ క్రమంలో ప్రూఫ్‌లు అంటూ తమ దగ్గర ఉన్న కొన్ని ఫోటోలను కూడా బయటకు రిలీజ్ చేశారు. కంగనా అందించిన ప్రూఫ్స్ అన్ని ఫోటో షాప్ బాపతే అని హృతిక్ రోషన్ మాజీ భార్య ఖరాఖండిగా తెల్చేయడంతో… కంగనా ఎపిసోడ్ కీలక మలుపు తీసుకుంది. ఇదిలావుంటే సుసానే తన పిల్లలతో కలిసి అబ్రాడ్ టూర్ వేసింది. 
 
అక్కడికి హృతిక్ కూడా వెళ్లడంతో మళ్ళీ వీరిద్దరు కలవబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై స్పందించిన సుసానే ఓ క్లారిటి ఇచ్చింది 'నేను అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా... హృతిక్‌తో కలిసి జీవితం పంచుకోవడం అనేది జరగదు. కానీ మేం మంచి పేరెంట్స్ - మా తొలి ప్రాధాన్యం పిల్లలే' అంటూ సుసానే ఖాన్ ట్వీట్ చేసింది. దీంతో మాజీ భార్య భర్తలిద్దరు కలవనున్నారనే ప్రచారానికి కూడా అడ్డుతెర పడింది.