అక్షయ్ కుమార్ సరసన గోవా బ్యూటీ ఇలియానా: నెగటివ్ రోల్లో ఇషా గుప్తా!
గోవా బ్యూటీ ఇలియానాకు బాలీవుడ్లో బంపర్ ఆఫర్ లభించింది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని ఇలియానా సొంతం చేసుకుంది. అక్షయ్ హీరోగా ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే 'రుస్తుం' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గతంలో నీరజ్ వద్ద పనిచేసిన టిను దేశాయ్ దీని ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే ఈ చిత్రం షూటింగును వచ్చే ఏడాది ప్రారంభంలో లండన్లో సాగనుంది.
ఇక ఈ సినిమాలో ఇలియానా ప్రధాన కథానాయికగా ఎంపిక కాగా, నెగటివ్ రోల్లో ఇషా గుప్తా నటించనుంది. లండన్లో షూటింగ్ ముగించుకుని వచ్చాక, భారత్, యూరప్లోనూ మరికొన్ని అంతర్జాతీయ లొకేషన్స్లో ఈ సినిమా షూటింగ్ జరుగనుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి సినిమాను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.