షూటింగ్ కోసం చెన్నై వెళుతూ రోడ్డు ప్రమాదం... టీవీ నటి దుర్మరణం...
కర్నాటక రాష్ట్రానికి చెందిన టీవీ నటి దుర్మరణం చెందింది. షూటింగ్ కోసం చెన్నైకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని సున్నంపకొట్టయ్
కర్నాటక రాష్ట్రానికి చెందిన టీవీ నటి దుర్మరణం చెందింది. షూటింగ్ కోసం చెన్నైకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని సున్నంపకొట్టయ్ గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ వివరాలను పరిశీలిస్తే కన్నడ బుల్లితెర నటిగా రేఖా సింధు మంచి పేరు తెచ్చుకుంది. ఈమెతో పాటు మరో నలుగురు కలిసి కారులో బెంగుళూరు నుంచి చెన్నైకు వెళుతున్నారు. ఈ కారు చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె దుర్మరణం పాలైంది.
ప్రమాదంలో చనిపోయిన మిగతా ముగ్గురిని అభిషేక్ కుమారన్ (22), జయకంద్రన్ (23), రక్షణ్ (20)గా గుర్తించారు. మృతదేహాలను తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డివైడర్ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని వేలూరు ఎస్పీ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఆరుగురు ఉన్నారని వెల్లడించారు. గాయపడిన వారిలో ఇద్దరినీ వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.