శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 8 జులై 2016 (16:57 IST)

కరిష్మా కపూర్ వద్ద సంజయ్ కపూర్ రచ్చ రచ్చ.. రెస్టారెంట్లో వేర్ వ్యక్తితో చూసి ఇన్సల్ట్ చేశాడు..!

కరిష్మా కపూర్ తన రెస్టారెంట్లో వేరే వ్యక్తితో ఉన్నట్లు తెలుసుకున్న సంజయ్ కపూర్ ఆమెతో రచ్చ రచ్చ చేశాడని ముంబై మిర్రర్ పత్రిక వెల్లడించింది.

ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ భర్త విడాకులు తీసుకున్నాక కూడా ఓవరాక్షన్ చేశాడట. పారిశ్రామిక వేత్త సంజయ్ కపూర్‌తో ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్న కరిష్మా.. ఇటీవల తన భర్తకు చెందిన ఓ రెస్టారెంట్లో తన స్నేహితులతో కలిసి రావడం వివాదానికి తావిచ్చింది. కరిష్మా కపూర్ తన రెస్టారెంట్లో వేరే వ్యక్తితో ఉన్నట్లు తెలుసుకున్న సంజయ్ కపూర్ ఆమెతో రచ్చ రచ్చ చేశాడని ముంబై మిర్రర్ పత్రిక వెల్లడించింది.
 
కరిష్మా కపూర్ తన స్నేహితుడు సందీప్ తోషివాల్‌తో కలిసి తన మాజీ భర్త రెస్టారెంటుకే రావడాన్ని సంజయ్ కపూర్ జీర్ణించుకోలేకపోయాడు. వారిని చూసిన సంజయ్ కపూర్ నోటికి వచ్చినట్లు అరిచాడు. ఆమెని అవమానించే మాటలు మాట్లాడుతూ సీన్ క్రియేట్ చేశాడు. దాంతో ఆమెకు ఏమి చేయాలో అర్థం కాకుండా మిన్నకుండిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరగడంతో.. సంజయ్ ఫ్రెండ్స్ గట్టిగా చెప్పేదాకా ఆపకుండా న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. 
 
అంతేకాదు.. తాను కరిష్మాను వివాహం చేసుకోవట్లేదని.. కేవలం స్నేహితుడు మాత్రమేనని సందీప్ చెప్పేదాకా ఓవరాక్షన్ చేశాడు. ఇదంతా చూసిన కరిష్మా సిగ్గుతో తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.