మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 17 జూన్ 2018 (10:52 IST)

కస్తూరిపై కేసు.. హిజ్రాలపై నోరు పారేసుకోవడంతో..?

దక్షిణాది సీనియర్ నటి కస్తూరి ప్రస్తుతం చిక్కుల్లో పడింది. హిజ్రాలపై నోరు పారేసుకోవడంతో ఆమెపై కేసు నమోదైంది. తమిళనాడులో 18మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును హేళన చేస్తూ స్ప

దక్షిణాది సీనియర్ నటి కస్తూరి ప్రస్తుతం చిక్కుల్లో పడింది. హిజ్రాలపై నోరు పారేసుకోవడంతో ఆమెపై కేసు నమోదైంది. తమిళనాడులో 18మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును హేళన చేస్తూ స్పందించడంపై నటి ఇబ్బందుల్లో చిక్కుకుంది. 
 
మూడు రోజుల క్రితం అనర్హత కేసులో తీర్పు వెలువడగా, తమిళంలో హిజ్రాలను సంబోధించే ఒంబోదు.. అనే పదాన్ని వాడుతూ కస్తూరి ఓ ట్వీట్ పెట్టింది. కోర్టు తీర్పు అటూ ఇటూ కానిదన్న అర్థం వచ్చేలా ఆమె చేసిన వ్యాఖ్యలపై హిజ్రాలు భగ్గుమన్నారు.
 
మైలాపూర్‌లోని కస్తూరి ఇంటి ఎదుట తీవ్ర నిరసన తెలిపారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము కూడా సగటు మనుషులమేనన్న సంగతిని కస్తూరి మరచిందని, ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని హిజ్రాల సంఘాలు డిమాండ్ చేశాయి. హిజ్రాలు ఇచ్చిన ఫిర్యాదుపై మధురై, చెన్నై తదితర ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో కస్తూరిపై కేసు నమోదైంది.