భయపడిన కృష్ణవంశీ... 'రుద్రాక్ష'ను మరొకరు పట్టుకున్నారు...
భయపెట్టే సినిమా చేస్తానని ఇటీవలే ట్విట్టర్లో ప్రకటించిన కృష్ణవంశీ.. తనే భయపడే స్థాయికి చేరాడు. తాజాగా తను 'రుద్రాక్ష' అనే సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దాన్ని ఖండించలేదు. అయితే శుక్రవారం నాడు సిహెచ్. సుబ్బారెడ్డి అనే దర్శకుడు ఆ పేరుతో తనే చిత్రాన్ని తీస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నాడు.
ఇంతకుముందు 'రఫ్' అనే చిత్రాన్ని తీశాడు. ఆది హీరో. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది రూపొందనున్నదని, ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారనీ, మల్టీస్టారర్ చిత్రమని ప్రకటించాడు. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తానన్నారు. అయితే కృష్ణవంశీ రుద్రాక్ష లేనట్లేనన్నమాట.