గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఆగస్టు 2018 (12:27 IST)

పూజా హెగ్డేని మోసం చేసిన సాక్ష్యం నిర్మాత.. నిజమా?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా చిత్రం "సాక్ష్యం". ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. ఇందులో ఆమె స్కిన్‌ షోకే పరిమితమైంది. అసలు బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజా హెగ్డేను ఒప్పించేందుకు ఆ చిత్ర నిర్మాత మోస

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా చిత్రం "సాక్ష్యం". ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. ఇందులో ఆమె స్కిన్‌ షోకే పరిమితమైంది. అసలు బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజా హెగ్డేను ఒప్పించేందుకు ఆ చిత్ర నిర్మాత మోసంతో పాటు మాయమాటలు చెప్పి ఎంపికచేసినట్టు ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
 
ఒకవైపు, ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత', ప్రిన్స్ మహేష్‌తో 25వ సినిమా చేస్తున్న పూజా హెగ్దే సాక్ష్యంతో బెల్లంకొండ బాబుతో ఎలా చేసింది అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉత్పన్నమవుతోంది. దీనిపై ఇపుడు ఓ క్లారిటీ వచ్చింది. 'సాక్ష్యం' సినిమా మరో "బాహుబలి" అని చెప్పి పూజాని ఒప్పించారట. 
 
అంతేకాదు సినిమాలో ఆమె లుక్ ఎందుకో అంత బాగాలేదు. తనపై కేర్ తీసుకోలేదని అంటోంది ఈ చిన్నది. సాక్ష్యం సినిమాలో తనని మోసం చేశారని అంటోంది. సినిమాతో తన ఇమేజ్ రెట్టింపు అవుతుందన్న ఆలోచనతో ఈ సినిమా ఒప్పుకుందట. ఈ చిత్రంలో నటించేందుకు పూజా హెగ్డే కోటిన్నర రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంది. కానీ ఈ చిత్రం ఆమెకు ఆశించినంత పేరు ఇవ్వలేదు. 
 
కాగా, 'ముకుంద', 'ఒక లైలా కోసం' సినిమాల తర్వాత బాలీవుడ్ "మొహెంజోదారో" సినిమాలో హృతిక్ పక్కన పూజా హెగ్డే నటించింది. అక్కడ ప్రేక్షకులు తనని గుర్తించలేదని గ్రహించి తెలుగులోనే మళ్లీ సినిమాలు చేస్తోంది. అల్లు అర్జున్ నటించిన 'డిజే' సినిమాతో బికినివేసి యువత మనసు గెలిచిన పూజా హెగ్దే రీసెంట్‌గా సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి స్కిన్ షోతో అదరగొట్టింది.