శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (16:58 IST)

సూపర్ స్టార్ మహేష్, సమంత చేతుల మీదుగా ‘క్షణం’ థియేట్రికల్ ట్రైలర్

టాలీవుడ్ నిర్మాణ రంగంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్ రియలిస్టిక్ కాన్సెప్ట్ మూవీస్ నిర్మించే దిశగా అడుగులు వేస్తుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్న సస్పెన్స్ డ్రామా ‘క్షణం’. అడవి శేష్, ఆదాశర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో కనపడుతుంది. 
 
జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంతల చేతుల మీదుగా ఫిబ్రవరి 10న విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలియజేశారు. రవికాంత్ పేరెపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు అడవి శేష్ కథను అందించారు. సినిమాను మార్చి 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.