గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 8 జూన్ 2019 (09:26 IST)

తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న హీరోయిన్!

తెలుగులో వచ్చిన చిత్రం "బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్". ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ అర్చనా కవి. ఈ మలయాళ బ్యూటీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారుపై మెట్రో రైల్ శ్లాబ్ కాంక్రీట్ పెళ్ళలు ఊడిపడటంతో ఆమె ప్రమాదంలో చిక్కుకున్నారు. అయితే, ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 
 
ఈ విషయంపై అర్చన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. తాను ప్రయాణిస్తున్న కారుపై మెట్రో శ్లాబ్ పెళ్లలు ఉన్నట్టుండి విరిగిపడ్డాయనీ, ఈ ప్రమాదం నుంచి తాను రెప్పపాటులో తప్పించుకున్నట్టు తెలిపింది. తాను విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు పేర్కొంది. 
 
ఈ ఘటనలో తన కారు పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. అందువల్ల కారుతో పాటు.. కారు డ్రైవర్‌కు కూడా మెట్రో రైల్ అధికారులు తగిన పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.