శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (10:52 IST)

సందీప్ కిషన్ హీరోగా మెహరీన్ హీరోయిన్‌గా కొత్త చిత్రం

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలతో విజ‌యాల్ని అందుకుంటున్న‌ సందీప్ కిషన్ హీరోగా, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌క‌థ చిత్రంతో యూత్‌ని ఆక‌ట్టుకున్న‌ మెహరీన్ హీరోయిన్‌గా "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" పతాకంపై స్వామిరారా

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలతో విజ‌యాల్ని అందుకుంటున్న‌ సందీప్ కిషన్ హీరోగా, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌క‌థ చిత్రంతో యూత్‌ని ఆక‌ట్టుకున్న‌ మెహరీన్ హీరోయిన్‌గా "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" పతాకంపై స్వామిరారా చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్‌తోపాటు, హీరోహీరోయిన్లపై ఒక పాటను కూడా వైజాగ్‌లో చిత్రీకరిస్తున్నారు. 
 
ఈ చిత్రాన్నికాన్సెప్టెడ్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రం "నా పేరు శివ" ఫేమ్ సుసీంథరన్ దర్శకత్వం చేస్తున్నారు. ప్ర‌స్తుతం వైజాగ్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'క‌బాలి' చిత్రంలో యాక్ష‌న్‌తో ఓ కొత్త ట్రెండ్ సృష్టించిన అంబు, అరివులు యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేస్తున్నారు. "గజరాజు"," జిల్లా", "రైల్" వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన త‌మిళ సంగీత ద‌ర్శ‌క‌డు డి.ఇమ్మాన్ ఈ చిత్రంతో ప‌రిచ‌యం అవుతున్నారు.
 
ఈ సందర్భంగా సహ-నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. "నా పేరు శివ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా చాలా మంచి పేరు సంపాయించిన ద‌ర్శ‌కుడు సుసీంథ‌ర‌న్‌ దర్శకత్వంలో "నా పేరు శివ" తరహాలో తెరకెక్కనున్న ఈ చిత్రం కూడా అదే స్థాయి కథ-కథనాలతో రూపొందుతుంది. దర్శకులు సుసీంధరన్ అద్భుతమైన కథను రెడీ చేశారు. యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్ష‌న్ పార్ట్‌ని క‌బాలి చిత్రానికి ప‌నిచేసిన అంబు, అరియు‌లు చేస్తున్నారు. 
 
ఈ చిత్రంలో మా హీరో సందీప్ కిషన్ ఓ మధ్యతరగతి యువకుడిగా కనిపించనున్నారు. సందీప్ త‌ప్ప‌కుండా కొత్త కేర‌క్ట‌రైజేష‌న్‌తో అంద‌రిని ఆక‌ట్టుకుంటాడు. ప్ర‌స్తుతం వైజాగ్‌లో జరుగుతున్న తాజా షెడ్యూల్‌లో సందీప్-మెహరీన్‌లపై ప్రముఖ కొరియోగ్రాఫర్ శోభి మాస్టర్ సారధ్యంలో ఒక పాటతోపాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. 30 రోజులపాటు వైజాగ్ లో జరగనున్న ఈ భారీ షెడ్యూల్ కోసం ఒక సెట్ కూడా వేశారు, ఆ సెట్‌లోనే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు చెప్పారు. 
 
హీరోహీరోయిన్లతోపాటు సత్య, ప్రవీణ్, ధనరాజ్‌లు కూడా పాల్గొననున్న ఈ షెడ్యూల్‌లోనే అంబు, అరియు నేతృత్వంలో రెండు యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తమిళ - తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకరైన డి.ఇమ్మాన్‌గారిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది" అన్నారు.