1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2016 (17:18 IST)

నాకెంతో ఇష్టమైన హీరోయిన్ దివ్యవాణి... ఎమ్మెల్యే బాబూ మోహన్

ప్రాజ్ఞేయ ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై స్ర‌వంతి స‌మ‌ర్ప‌ణ‌లో డి.శ్రీధ‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `నీ దేవుడే నా దేవుడు`. ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

ప్రాజ్ఞేయ ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై స్ర‌వంతి స‌మ‌ర్ప‌ణ‌లో డి.శ్రీధ‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `నీ దేవుడే నా దేవుడు`. ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో.... 
 
ఎమ్మెల్యే బాబూ మోహ‌న్ మాట్లాడుతూ... తొలి కిర‌ణం ద‌ర్శ‌కుడు జాన్‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. అలాగే నాకెంతో ఇష్ట‌మైన హీరోయిన్ దివ్య‌వాణి ఈ చిత్రంలో ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. బైబిల్ సంబంధిత సినిమాలు చాలా త‌క్కువ‌గా వ‌స్తుంటాయి. బైబిల్‌లోని అత్తాకోడ‌ళ్లుకు సంబంధించిన క‌థ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మంచి మెసేజ్ ఉన్న చిత్రం. మంచి టీం కుదిరింది. సినిమా మంచి స‌క్సెస్‌ను సాధించాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు. 
 
ద‌ర్శ‌కుడు జాన్‌బాబు మాట్లాడుతూ... ``ఇది హిస్టారిక‌ల్ చిత్రం. క్రీస్తుపూర్వం ఇజ్రాయిల్ దేశంలో జ‌రిగిన అత్తాకోడ‌ళ్లు క‌థ‌. దాదాపు ప‌ది కోట్ల రూపాయల వ్య‌యంతో ఈ చిత్రాన్ని నిర్మాత తెర‌కెక్కిస్తున్నారు. తొలి కిర‌ణం త‌ర్వాత నా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ఇది. ఖ‌ర్చుకు ఎక్క‌డా రాజీ కావ‌డం లేదు. రెండు షెడ్యూల్స్‌లో సినిమా పూర్త‌వుతుంది. తొలి షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో ఈ నెల 26 వ‌ర‌కు జ‌రుగుతుంది. రెండో షెడ్యూల్ టర్కీలో చిత్రీక‌రిస్తాం. జూన్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. దివ్య‌వాణి మా సినిమా న‌టించ‌డానికి ఒప్పుకోవ‌డం ఆనందంగా ఉంది. ఆర్.పి.ప‌ట్నాయ‌క్‌ మంచి సంగీతాన్ని అందించారు అని చెప్పారు.
 
దివ్య‌వాణి మాట్లాడుతూ... నేను ప‌దిహేనేళ్ల వ‌య‌సు నుండి సినిమాల్లో న‌టిస్తున్నాను. పెళ్లైన త‌ర్వాత ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నాను. నాకు ఇష్ట‌మైన ఈ ఫీల్డ్‌కు దేవుడు న‌న్ను మ‌ళ్లీ ఆహ్వానించాడు. బైబిల్‌లోని ఓ క‌థ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఓ కుంటుంబంలోని ప్రేమానురాగాలను ఆధారంగా చేసుకుని సినిమా ఉంటుంది. న‌యోని అనే పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. మా టీంకు ఆ ప్ర‌భువు, ప్రేక్ష‌కుల ఆశీర్వాదం ఉంటుంద‌ని భావిస్తున్నాం అన్నారు.