షూటింగ్ అపుడే అయిపోయిందా! అని బాధపడ్డా : నాగార్జున
అక్కినేని నాగార్జున నటిస్తున్న 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం షూటింగ్ కీలక షెడ్యూల్ జరుగుతోంది. తిరుమల శ్రీవారి భక్తులు హతీరామ్ బాబా బయోగ్రఫీ నేపథ్యంలో చిత్రం రూపొందుతోంది.
అక్కినేని నాగార్జున నటిస్తున్న 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం షూటింగ్ కీలక షెడ్యూల్ జరుగుతోంది. తిరుమల శ్రీవారి భక్తులు హతీరామ్ బాబా బయోగ్రఫీ నేపథ్యంలో చిత్రం రూపొందుతోంది. అమర్సాయికృప ఎంటర్టైన్మెంట్ బేనర్పై ఎ.మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాత్ర కోసం నాగార్జున ప్రత్యేక శ్రద్ద తీసుకుని చేశారు. కేశాలంకరణ, బాడీ లాంగ్వేజ్ను కొద్దిగా మార్చారు.
ఇటీవలే నాగార్జునకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. 'ఈ చిత్రం ఆఖరి రోజు అప్పుడే షూటింగ్ అయిపోయిందా అని బాధపడ్డాను. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తున్నామని నాగ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఫిలింసిటీలో చిత్రీకరణ సాగుతోంది. కీరవాణి బాణీలు సమకూరుస్తున్నారు. డిసెంబర్ నెలాఖరకు బాణీలు పూర్తవుతాయి. జనవరిలో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అనుష్క, ప్రగ్వాజైశ్వాల్, సౌరభ్రాజ్ జైన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.