1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (11:08 IST)

''మ‌న్మ‌థుడు'' సినిమాకు సీక్వెల్.. రకుల్, నాగార్జున జంటగా..?

''మ‌న్మ‌థుడు'' సినిమాకు సీక్వెల్ రానుంది. కింగ్ నాగార్జున రూపొందిస్తున్న ఈ సినిమా మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కనుంది. నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ ‌(జెమిని కిర‌ణ్‌) నిర్మిస్తున్న ''మ‌న్మ‌థుడు 2" సినిమా ప్రారంభోత్సవం లాంఛ‌నంగా అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. చిత్ర యూనిట్‌తో పాటు అక్కినేని అమ‌ల‌, నాగ‌చైత‌న్య ముఖ్య అతిథులుగా ఈ కార్య‌క్రమంలో పాల్గొన్నారు.
 
అమ‌ల అక్కినేని ముహుర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్ట‌గా.. అక్కినేని నాగ‌చైత‌న్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ యూర‌ప్‌లో ప్రారంభం కానుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను రాహుల్ ర‌వీంద్ర‌న్ తెర‌కెక్కించ‌నున్నారు. ఆర్ ఎక్స్ 100 ఫేమ్  చైత‌న్య భ‌ర‌ద్వాజ్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
 
కింగ్ నాగార్జున‌, రకుల్ ప్రీత్ సింగ్, ల‌క్ష్మి, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్‌, నాజ‌ర్‌, ఝాన్సీ, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు నటించిన ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం:  రాహుల్ ర‌వీంద్ర‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.సుకుమార్‌, స్క్రీన్‌ప్లే:  రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌.