శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2016 (17:00 IST)

నాని - దిల్ రాజు - త్రినాథ రావుల "నేను లోకల్" ప్రారంభం

వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, నిర్మాతగా దిల్ రాజు ఒక నూతన చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి "నేను లోకల్" అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, నిర్మాతగా దిల్ రాజు ఒక నూతన చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి "నేను లోకల్" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కాప్షన్ "ఆటిట్యూడ్ ఐస్ ఎవిరీథింగ్". "సినిమా చూపిస్తా మామా" చిత్రానికి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. 'నేను శైలజా' సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ ఈ చిత్రానికి హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తారు. 
 
ఈ చిత్రం ముహూర్తపు పూజా కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ ఆఫీస్‌లో జరిగింది. హీరో నాని, కీర్తి సురేష్, దిల్ రాజు, శిరీష్, దర్శకులు త్రినాథ రావు, ఇతర యూనిట్ సభ్యుల‌తో పాటు అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జెమినీ కిరణ్, స్రవంతి రవి కిశోర్, దానయ్య, నవీన్ యెర్నేని, దాము కానూరి, ఠాగూర్ మధు, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. 
 
"సినిమా చూపిస్తా మామా" చిత్రం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. దర్శకులు త్రినాథ్ నాకు ఈ కథ చెప్పగానే వెంటనే నచ్చింది. ఎప్పటినుండో నానితో ఒక సినిమా తీయాలని అనుకుంటున్నా అనివార్య కారణాల వల్ల కుదరలేదు. ఈ కథ వినగానే నాని హీరోగా బాగుంటాడు అనుకుని అడగటం జరిగింది. నాని కూడా వెంటనే ఓకే చెప్పాడు. క్యారెక్టర్ బేస్డ్ లవ్ స్టోరీ ఇది. మా బ్యానర్‌లో ఆర్య వంటి క్యారక్టరైజేషన్ బేస్డ్ లవ్ స్టోరీ ఎంతటి పేరు తెచ్చిందో ఈ చిత్రం కూడా అంతే పేరు తెస్తుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే ఈ సంవత్సరం చివరి భాగంలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం" అని దిల్ రాజు తెలిపారు. 
 
హీరో నాని మాట్లాడుతూ, "రియల్ లైఫ్ ఎంతో డ్రమాటిక్‌గా జరుగుతోంది. ఒక చిత్రం 50 డేస్ పూర్తి చేసుకుంది. ఒకటి విడుదలకు సిద్ధం అవుతోంది. మరొకటి ఇవాళ ప్రారంభం అయింది. కొన్ని కథలు చూసి ఎంజాయ్ చేస్తాం. ఈ కథ మాత్రం వింటూనే ఎంజాయ్ చేశాను. దిల్ రాజుకి నాకు వేవ్ లెంగ్త్ మ్యాచ్ అవుతుంది. ఆయనతో పని చేయటం ఆనందంగా ఉంది. దర్శకులు త్రినాథ్ చాలా బాగా తీస్తారు అనుకుంటున్నా. కీర్తి సురేష్ మా సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. ఆమె చేసిన 'రజిని మురుగన్' సినిమా చాలా నచ్చింది. తాను ఈ సినిమాలో రోల్‌కి పర్ఫెక్ట్ అనిపించింది. హీరోగా సినిమాలు చేస్తోన్న నవీన్ చంద్ర ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేయటానికి ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్. మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇది", అని అన్నారు. 
 
దర్శకులు త్రినాథ రావు మాట్లాడుతూ "నాకు ఉన్న చాలా ఇష్టాలు ఈ చిత్రంతో తీరుతున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్‌లో చేయాలనీ ఎప్పటినుండో అనుకుంటున్నా. హీరో నాని ఒక నాచురల్ యాక్టర్. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. అలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. ఈ కోరికలన్నీ ఈ చిత్రంతో తీర్చుకుంటున్నా. కథలో మంచి ఎనర్జీ ఉంటుంది. మీ ముందుకు ఒక మంచి లవ్ ఎంటర్టైనర్‌తో వస్తాం" అన్నారు 
 
రచయిత ప్రసన్న మాట్లాడుతూ, "నా సినిమాలో హీరోలు మారుతున్నారు గానీ దర్శకుడు కాదు. త్రినాథ రావు ఈ చిత్రాన్ని కూడా విజయవంతంగా తీస్తారు అని అనుకుంటున్నా. హీరో నానితో చేయాలనీ, దిల్ రాజు నిర్మాణంలో పని చేయాలనీ ఎప్పటినుండో ఆశ పడుతున్నా. ఈ చిత్రంతో ఆ కోరిక నెరవేరుతోంది అని అన్నారు. 
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి నిజార్ షఫీ, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, కథ - స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ, రచన : సాయి కృష్ణ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రినాథ రావు నక్కిన, అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కెం వేణుగోపాల్, సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి, నిర్మాత : శిరీష్, సమర్పణ : దిల్ రాజు, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే విడుదల చేస్తాం అని చిత్ర బృందం తెలిపింది.