శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (10:07 IST)

డైసీ స్థానంలో నిత్యా మీనన్.. జక్కన్న నుంచి పిలుపు

దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్లుగా బాలీవుడ్ నటి అలియా భట్, బ్రిటీష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్‌ను ఎంపిక చేశారు. అయితే, తన వ్యక్తిగత కారణాల రీత్యా డైసీ ఈ భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో కొత్త హీరోయిన్ కోసం దర్శకుడు అన్వేషణ మొదలు పెట్టారు. 
 
ఈ క్రమంలో పలువురు పేర్లు వినిపించాయి. ముఖ్యంగా, బాలీవుడ్ నటీమణులు శ్రద్ధా కపూర్‌ లేదా అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్‌ల పేర్లను రాజమౌళి పరిశీలించినట్టు తేలింది. కానీ, ఇపుడు మరో పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరు నిత్యామీనన్. ఆమెకు రాజమౌళి నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.
 
దీంతో లుక్‌ టెస్ట్‌ కోసం ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. అయితే ఆమె ఎన్టీఆర్‌కు జోడీగా నటించబోతున్నారా? లేదా మరేదైనా కీలకమైన పాత్ర కోసం జక్కన్న సంప్రదించారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
 
కాగా, ఈ చిత్రంలో అల్లూరి సీతా రామరాజుగా రామ్‌ చరణ్‌‌, కొమరం భీమ్‌గా తారక్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. చెర్రీకి జోడీగా బాలీవుడ్‌ నటి అలియాభట్‌ నటిస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎం‌.ఎం‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకురానుంది.