గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 21 అక్టోబరు 2018 (12:15 IST)

ఆచారాల్లో వేలు పెట్టొద్దు... ప్లీజ్.. రజినీకాంత్

సుప్రీంకోర్టు తీర్పు మేరకు శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని సినీ సూపర్ స్టార్ రజినీకాంత్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో దేవాలయాల సంప్రదాయాలను, నియమాలను కూడా గౌరవించాలన్నది నా మనవి అని ఆయన వ్యాఖ్యానించారు.
 
ప్రస్తుతం తన 165వ చిత్రం "పేట్టా" షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ గత కొద్దిరోజులుగా వార‌ణాసిలో జ‌రిగింది. అనుకున్న స‌మ‌యానికంటే 15 రోజుల ముందే షెడ్యూల్ పూర్తి చేశారు. దీంతో త‌న ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు. 
 
త‌న ట్విట్ట‌ర్‌లో 'పేట్టా' సినిమాని అనుకున్న స‌మ‌యానికంటే 15 రోజుల ముందే పూర్తి చేసాం అని తెలిపారు. ఇది టీమ్ స‌మిష్టి కృషి అన్నారు. ఆగ‌స్టు 19న ట్వీట్ చేసిన ర‌జ‌నీ మ‌ళ్ళీ అక్టోబ‌ర్ 19న ట్వీట్ చేయ‌డం విశేషం. 
 
పేట్టా షెడ్యూల్ పూర్తి చేసుకొని చెన్నై చేరుకున్న ర‌జ‌నీకాంత్‌ని మీటూ ఉద్య‌మంతో పాటు శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి మ‌హిళ‌ల ప్ర‌వేశం గురించి విలేకరులు ప్ర‌శ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, మీటూ ఉద్య‌మం స‌క్ర‌మ మార్గంలో వెళితే మంచిది. దానిని దుర్వినియోగం చేయ‌కూడ‌దన్నారు. 
 
ఇకపోతే, పేట్టా చిత్రంలో కార్తీక్ సుబ్బ‌రాజు తెర‌కెక్కిస్తుండ‌గా ఈ చిత్రంలో సిమ్రాన్, త్రిష, విజయ్‌ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, మేఘా ఆకాష్, సతన్‌రెడ్డి, మాళవికా మోహనన్‌లతో పాటు డైరెక్టర్లు మహేంద్రన్, శశికుమార్‌ కీలక పాత్రలు పోషించారు. 
 
ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, రజనీకాంత్‌ క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని టాక్‌. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించిన ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.