బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 25 నవంబరు 2017 (16:33 IST)

పద్మావతికి ఆ ఆత్మహత్యకు లింకులేదు : రతన్ సైనీ

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించి.. బాలీవుడ్ అగ్రతారలు దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన పద్మావతి సినిమాను వివాదాలు వీడట్లేదు. ఒకవైపు కర్ణిసేన రాజ్‌పుత్‌లు పద్మావత

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించి.. బాలీవుడ్ అగ్రతారలు దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన పద్మావతి సినిమాను వివాదాలు వీడట్లేదు. ఒకవైపు కర్ణిసేన రాజ్‌పుత్‌లు పద్మావతికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన నేపథ్యంలో.. పద్మావతి సినిమాకి వ్యతిరేకంగా జైపూర్ సమీపంలోని నహార్‌గఢ్ కోటపై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యను కూడా పద్మావతికి లింకు పెట్టి మీడియాలో వార్తలు వచ్చేశాయి. 
 
కోట పైభాగం నుంచి వెలుపలి వైపు అతడి మృతదేహం ఉరివేసుకుని వేలాడుతూ కనిపించండంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అయితే యువకుడు పద్మావతి కోసం ఆత్మహత్య చేసుకున్నాడా? లేకుంటే ఎవరైనా యువకుడి శవాన్ని రాజస్థాన్ కోటకు కట్టి.. పద్మావతి కోసం ఆత్మహత్య అంటూ చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. 
 
ఇందులో భాగంగా.. జైపూర్‌లోని న‌హ‌ర్‌గ‌ర్ కోట‌గోడ‌కు ఉరివేసుకుని చ‌నిపోయిన చేత‌న్ కుమార్ సైనీ ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికివాడు కాద‌ని, ఎవ‌రో హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌గా సృష్టించార‌ని చేత‌న్ కుమార్ సోద‌రుడు రామ్ ర‌త‌న్ సైనీ స్పష్టం చేశాడు. అంతేగాకుండా పద్మావతి సినిమాకు తన సోదరుడి మరణానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. 
 
తన సోదరుడి మృతి పట్ల విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాడు. మరోవైపు చేతన్ కుమార్ ఆత్మహత్యకు కర్ణిసేన బాధ్యత వహించలేదు. అతని ఆత్మహత్యకు కర్ణిసేనకు లింకులేదని ఇప్పటికే కర్ణిసేన స్పష్టం చేసింది.