శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 24 డిశెంబరు 2016 (14:26 IST)

'నీకు ఒక్కదానికే అది ఉంది... మిగతావారికేవీ?' పరిణితి చోప్రా ఫ్యాన్స్ ట్వీట్స్

బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ఎరక్కపోయి ఓ ట్వీట్ చేసి ఇరుక్కుపోయింది. ఆమె చేసిన ట్వీట్ పైన ఆమె అభిమానులు ఆమెను ఇరుకునపెట్టే ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే, పరిణితి యువనటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'మేరీ ప్యారీ బ

బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ఎరక్కపోయి ఓ ట్వీట్ చేసి ఇరుక్కుపోయింది. ఆమె చేసిన ట్వీట్ పైన ఆమె అభిమానులు ఆమెను ఇరుకునపెట్టే ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే, పరిణితి యువనటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'మేరీ ప్యారీ బిందు' అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. సెట్లో తను షూటింగులో పాల్గొన్న ఫోటోలను కొన్ని పోస్ట్ చేసింది. అందులో ఓ ఫోటో చర్చకు దారి తీసింది. 
 
ముఖానికి మాస్క్ ధరించి ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ... 'సెట్ లో ఫుల్ డస్ట్ ఉంది. క్రూ మొత్తం మాస్క్‌లు ధరించారు. ఇంత అందంగా ఉంది మా ప్రొడక్షన్' అంటూ ఫోటో కింద కామెంట్ పెట్టింది. ఈ ఫోటోను నిశితంగా గమనించిన ఆమె అభిమానులు 'నీకు ఒక్కదానికే అది ఉంది. మిగతావారికేవీ. ఓసారి ఫోటోలు చూడు' అంటూ రీ-ట్వీట్లు చేస్తున్నారు. వారి ప్రశ్నలతో అమ్మడు ఏం చెప్పాలో తెలియక తికమక పడుతోంది.