శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 18 జూన్ 2017 (14:42 IST)

పవన్‌ కల్యాణ్ పంజాలో విలన్‌గా చేయనన్నాను.. భల్లాలదేవుడి పుత్రుడిగా రాజమౌళి ఛాన్సిచ్చారు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో విలన్‌గా నటించడం ఇష్టం లేదని చెప్పినట్లు నటుడు అడివి శేష్ అన్నాడు. కన్నడ దర్శకుడు విష్ణువర్ధన్, పవన్ కల్యాణ్ కాంబోలో పంజా సినిమా తీస్తున్నామని.. అందులో నటించమని ఆర్కా మీడియ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో విలన్‌గా నటించడం ఇష్టం లేదని చెప్పినట్లు నటుడు అడివి శేష్ అన్నాడు. కన్నడ దర్శకుడు విష్ణువర్ధన్, పవన్ కల్యాణ్ కాంబోలో పంజా సినిమా తీస్తున్నామని.. అందులో నటించమని ఆర్కా మీడియాకు చెందిన నీలిమా తిరుమలశెట్టి అడిగిందని, తన కజిన్ బ్రదర్ అడివి సాయికిరణ్‌తో అడిగి చెప్తానని నీలిమాతో చెప్పానని.. అతనితో విలన్‌గా నటించడం ఇష్టం లేదని చెప్పినట్లు అడివి శేష్ అన్నాడు. 
 
కానీ వెంటనే అన్నయ్య పవన్ కల్యాణ్‌తో నటించే అవకాశం వస్తే వదులుకోకు.. ఆయన సినిమాలను కోట్లాది మంది చూస్తారని.. వారందరికీ నువ్వు తెలిసిపోతావని సలహా ఇచ్చినట్లు అడివి శేష్ తెలిపాడు. అందుకే పంజాలో విలన్ ఛాన్సును వినియోగించుకున్నానని అడివి శేష్ వెల్లడించాడు. తొలిరోజు షూటింగ్‌‌లో బాలీవుడ్‌ నుంచి వచ్చాననుకుని పవన్‌ కళ్యాణ్‌ గారు తనను హిందీలో పలకరించారని చెప్పాడు.
 
కానీ తెలుగువాడినని తెలుసుకుని బాగా ఎంకరేజ్ చేశారన్నాడు. ఈ సినిమా విడుదలైన వెంటనే విలన్‌గా, విలన్ కొడుకుగా చెయ్యమంటూ చాలా ఆఫర్లు వచ్చాయని అన్నాడు. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి కుమారుడి పాత్రను రాజమౌళిగారు ఇవ్వడంతో హ్యాపీగా చేశానని అడివి శేష్ తెలిపాడు.