గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (12:08 IST)

రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్.. గ్లామర్ ఆరబోస్తుందా?

ఆర్‌ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ తన తొలి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్న పాయల్.. తాజాగా కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో రవితేజ నటించనున్న ఓ చిత్రంలో ఈ బ్యూటీ ఒక హీరోయిన్‌గా ఎంపికైంది.
 
ముగ్గురు హీరోయిన్లకు ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రంలో నన్ను దోచుకుందువటే ఫేమ్‌ సభా నటేష్‌ను మరొక హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రం డిసెంబర్‌ నుంచి సెట్స్‌ పైకి వెళ్లనుంది. రవితేజ డ్యూయల్‌ రోల్‌లో నటించనున్న ఈ చిత్రంలో సునీల్‌ ఓ ముఖ్య పాత్రలో నటించనున్నారు.
 
మరోవైపు అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలో రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. మాస్ మహారాజ రవితేజ, ఇలియానా జంటగా తెరకెక్కుతోన్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.