శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (15:17 IST)

బాలీవుడ్ రీమేక్ కానున్న 'పితామగన్' సినిమా..

విక్రమ్ నటించే ప్రతీ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందులో ఒకటిగా పితామగన్. ఈ చిత్రం విక్రమ్ కెరీర్‌లో పెద్ద హిట్ సాధించింది. ఈ పితామగన్ చిత్రాన్ని తెలుగులోకి కూడా అనువదించారు. అయితే సిమమా పేరు మాత్రం 'శివపుత్రుడు'గా పెట్టారు. పేరు ఎలా పెట్టినా.. తమిళ తెలుగు భాషల్లో సూప్ హిట్ చిత్రంగా నిలిచింది. 
 
ఈ సినిమాలో విక్రమ్ నటనకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఇందులో సూర్య నటన కూడా చాలా అద్భుతం. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రీమేక్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పితామగన్ రైట్స్‌ను బాలీవుడ్ దర్శకుడు సతీష్ కౌశిక్ తీసుకున్నారు. 
 
కానీ సతీష్.. ఇప్పుడు యాక్టర్‌గా బిజీగా ఉండడంతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసేందుకు మరో దర్శకుడ్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ముందుగానే బాలా విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన సేతు సినిమాను తేరే నామ్.. అనే టైటిల్‌తో రీమెక్ చేశారు సతీష్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా సతీషే. మరి పితామగన్ రీమేక్‌కి ఏ దర్శకుడిని ఎంపిక చేస్తారో.. విక్రమ్ సూర్య పాత్రలకు ఏ హీరోలను ఎంపిక చేస్తారో వేచి చూడాలి.