శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 26 ఏప్రియల్ 2018 (12:56 IST)

'సాహో' షూటింగ్ జరుగుతుండగానే.. జిల్ రాధాకృష్ణ- పూజా హెగ్డేతో ప్రభాస్

''బాహుబలి'' స్టార్ ప్రభాస్ తాజాగా ''సాహో'' సినిమా షూటింగ్‌లో బిజీ బీజీగా వున్నాడు. బాహుబలికి తర్వాత సాహో సినిమాకు చాలా గ్యాప్ ఇవ్వడంతో తదుపరి సినిమాకు ఇలాంటి గ్యాప్ వుండకుండా చూసుకోవాలని ప్రభాస్ నిర్ణ

''బాహుబలి'' స్టార్ ప్రభాస్ తాజాగా ''సాహో'' సినిమా షూటింగ్‌లో బిజీ బీజీగా వున్నాడు. బాహుబలికి తర్వాత సాహో సినిమాకు చాలా గ్యాప్ ఇవ్వడంతో తదుపరి సినిమాకు ఇలాంటి గ్యాప్ వుండకుండా చూసుకోవాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఒకేసారి రెండు సినిమాలు సెట్స్‌పై ఉండేలా చూడాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు. 
 
ఇందులో భాగంగా ''సాహో'' సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే, మరో వైపున కృష్ణంరాజు సొంత సినిమాను చేయడానికి రెడీ అవుతున్నాడు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై ఏడో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదల చేసేందుకు సినీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.
 
ప్రభాస్‌తో సినిమాపై హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ.. ఎంటర్‌టైనింగ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోందని చెప్పింది. ఇప్పటికే ప్రభాస్-రాధాకృష్ణ సినిమా కోసం తనను సంప్రదించారని.. ఈ సినిమా స్టోరీ అదిరిపోయిందని.. ఈ ఛాన్స్ తనకు రావడంతో ఎగిరి గంతేశానని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. ఇప్పటికే హృతిక్ రోషన్‌ మొహంజదారో సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాహో స్టార్‌తో నటించడంపై పూజా హెగ్డే హర్షం వ్యక్తం చేసింది.