నేను చూసిన చిత్రాల్లోనే ది బెస్ట్ ''విసారనై'': రజనీకాంత్ కితాబు
వెట్రిమారన్ దర్శకత్వంలో దినేష్, సముద్రగని, కిషోర్ ప్రధానపాత్రల్లో నటించిన 'విసారనై' చిత్రం తమిళంలో విడుదలై భారీ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాపై తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ వంటి ప్రముఖులు వీక్షించి ప్రశంసల వర్షం కురిపించారు. ధనుష్ నిర్మించిన ఈ చిత్రాన్ని చూసిన రజనీ, ఆయన అభిరుచిని అభినందించారు. మానవ హక్కుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. అలా ఆయన నిర్మించిన 'విసారనై' చిత్రం అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పలు అవార్డులను గెలుచుకోవడం గమనార్హం.
రజినీకాంత్ మాట్లాడుతూ మొదటి నుంచి కూడా ధనుష్కి తన బాడీ లాంగ్వేజ్కి తగిన కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. కొత్తదనానికి .. సహజత్వానికి దగ్గరగా వుండే కథలను ఎంచుకొని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ చిత్రం చూసిన తర్వాత రజినీకాంత్ ఇప్పటివరకు తను చూసిన చిత్రాల్లోనే ది బెస్ట్ చిత్రమని చెప్పడం ఇంకో విశేషం.
ఇక కమల్ హసన్ మాట్లాడుతూ డైరెక్టర్ వెట్రిమారన్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని, సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. తాజాగా రజినీకాంత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇంత అద్భుత చిత్రాన్ని నిర్మించినందుకు ధనుష్తో పాటు చిత్ర దర్శకుడు వెట్రిమారన్ని కూడా పొగిడారు.