ఆమె వస్తున్నారనీ... మూడు గంటలు రాకపోకలు బంద్... పోలీసుల ఓవరాక్షన్.. ఎక్కడ..?
ఆమె వస్తున్నారని పోలీసులు రహదారినే మూసేశారు.. గంటా అరగంటా కాదు. ఏకంగా మూడు గంటలపాటు రాకపోకలను నిలిపేశారు. అదీ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలోని ఎస్.ఆర్.నగర్ ప్రధాన రహదారిని మూసివేశారు. ఇంతకీ ఎవరామె?
హైదరాబాద్లోని ఓ హోటల్ ప్రారంభానికి సినీనటి రకుల్ ప్రీత్సింగ్ వస్తోందని పోలీసులు ఏకంగా రహదారిని మూసివేశారు. అత్యంత రద్దీగా ఉండే ఈ రహదారి మూసివేతతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడడ్డారు. ఆమె ఓ ప్రైవేటు కార్యక్రమానికి వస్తే వాహనదారులను ఇబ్బందులు పెడుతూ పోలీసుల ఓవరాక్షన్ను సీటీవాసులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.