శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 18 అక్టోబరు 2018 (11:15 IST)

'మీటూ' ఉద్యమం : వేధింపులను ధైర్యంగా వెల్లడించాలి... రకుల్ ప్రీత్ సింగ్

'మీటూ' ఉద్యమానికి భాషాభేదాలకు అతీతంగా మద్దతు లభిస్తోంది. దక్షిణాది అగ్రనాయకానాయికలు బాధితులకు అండగా ఉంటామని భరోసానిస్తున్నారు. హీరోయిన్లు సమంత, రకుల్‌ప్రీత్‌సింగ్, తమిళ హీరో విశాల్ 'మీటూ'కు బాసటగా ఉంటామని తెలిపారు. వేధింపులపై ధైర్యంగా ముందుకు వచ్చి వెల్లడించాలని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. 
 
దీనిపై స్పందిస్తూ, చిత్ర పరిశ్రమలో వేధింపులకు గురైన మహిళలు ధైర్యంగా ముందుకురావడం శుభపరిణామమన్నారు. మీటూ ఉద్యమం సత్ఫలితాలనిస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది. మీటూ విస్త్రతంగా ప్రచారం పొందడం ఆనందంగా ఉందన్నారు. 
 
దీనివల్ల మంచి మార్పువస్తుందని ఆశిస్తున్నాను. పనిచేసే ప్రదేశాలు మహిళలకు సురక్షితంగా ఉంచాలని ఆయన చెప్పారు. అయితే, మీటూని దుర్వినియోగం చేయకుండా నిజాయితీగా న్యాయం కోసం పోరాడాలి అని చెప్పింది. 
 
ఇటీవలే దర్శకుడు లవ్‌రంజన్‌పై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేశారు. ఈ విషయమై రకుల్‌ప్రీత్‌సింగ్ స్పందిస్తూ దర్శకుడు లవ్‌రంజన్ అందరితో బాగుండేవాడు. ఆయనపై ఆరోపణలు రావడం ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది అని వ్యాఖ్యానించింది.