శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2015 (13:34 IST)

రకుల్ ప్రీత్ సింగ్ పారితోషికం.. రూ.1.5కోట్లుగా అప్.. ఎందుకంత పెంచేసింది?

టాలీవుడ్ అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ పారితోషికాన్ని పెంచేసిందట. రవితేజతో కిక్ 2 ఫ్లాప్ అయినప్పటికీ.. రకుల్ బ్రూస్‌లోపై ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్టైతే మాత్రం రూ.1.5 కోట్ల మొత్తాన్ని పారితోషికంగా డిమాండ్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. 
 
ఇప్పటికే భారీ ప్రాజెక్టులు అమ్మడి చేతులో ఉన్నాయని.. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక కొత్త సినిమాలో సైన్ చేయాలంటే రూ.1.5 కోట్లు పుచ్చుకోవాల్సిందేనని రకుల్ డిసైడైపోయింది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు కోటి రూపాయల్ని రకుల్ ప్రీత్ సింగ్ పుచ్చుకుంది. ఇంక రెమ్యునరేషన్‌ను పెంచుకునే దిశగా ప్లాన్ చేసేసింది.