శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 11 జులై 2017 (13:01 IST)

కొరటాల శివ తదుపరి ప్రాజెక్టు సిద్ధం.. హీరో ఎవరో తెలుసా?

హ్యాట్రిక్ హిట్లతో జోరుమీదున్న డైరెక్టర్ కొరటాల శివ తన తదుపరి ప్రాజెక్టును సిద్ధం చేసుకున్నారు. ఇందులో మెగా ఫ్యామిలీ హీరో నటించనున్నారు. ఆ హీరో ఎవరో కాదు.. రాం చరణ్. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్, మ

హ్యాట్రిక్ హిట్లతో జోరుమీదున్న డైరెక్టర్ కొరటాల శివ తన తదుపరి ప్రాజెక్టును సిద్ధం చేసుకున్నారు. ఇందులో మెగా ఫ్యామిలీ హీరో నటించనున్నారు. ఆ హీరో ఎవరో కాదు.. రాం చరణ్. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కించనున్నారు.
 
కాగా, చెర్రీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో ‘రంగస్థలం 1985’ అనే సినిమాలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్. అయితే.. ఈ చిత్రం తర్వాత చెర్రీ మణిరత్నం సినిమాలో నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ, మణిరత్న దర్శకత్వంలో చేయడం లేదని ఇపుడు తేలిపోయింది. 
 
'రంగస్థలం' తర్వాత తీయబోయే సినిమా గురించి రామ్‌చరణ్ ప్రకటించారు. తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుందని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో వెల్లడించారు. ఈ చిత్రం 2018 వేసవిలో సినిమాను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. కాగా, ఇదే విషయాన్ని రాంచరణ్ సతీమణి ఉపాసన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చెర్రీ ఫేస్‌బుక్ పోస్టును ట్వీట్ చేశారు. 
 
కొరటాల శివ మూడు వరుస సూపర్ డూపర్ హిట్లను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. 2013లో మిర్చి (ప్రభాస్), 2015లో శ్రీమంతుడు (మహేష్ బాబు), 2016లో జనతా గ్యారేజ్ (జూ.ఎన్టీఆర్) చిత్రాలు రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అలాగే, 2018లో భరత్ అనే నేను చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత చెర్రీ - కొరటాల కాంబినేషన్‌లో చిత్రం తెరక్కనుంది.