#9YearsForRamCharanInTFI... చెర్రీ ధృవ కోసం వెయిటింగ్...
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ సినీ ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్లు గడిచింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు. ట్విట్టర్లో తమ అభిమాన హీరోకు సంబంధించిన గత చిత్రాల తాలూకు చిత్రాలను షేర్ చేసుకుంటూ ఉన్నారు. కాగా రామ్చరణ్ నటి
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ సినీ ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్లు గడిచింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు. ట్విట్టర్లో తమ అభిమాన హీరోకు సంబంధించిన గత చిత్రాల తాలూకు చిత్రాలను షేర్ చేసుకుంటూ ఉన్నారు. కాగా రామ్చరణ్ నటిస్తున్న తాజా చిత్రం 'ధ్రువ'. ఈ చిత్రాన్ని ఆన్లైన్లో బాగా పబ్లిసిటీ చేస్తున్నారు.
ఒకవైపు తండ్రి చిరంజీవి ఖైదీ నెం.150 చేస్తుంటే.. కొడుకు ధ్రువగా ముందుకు వస్తున్నాడు. చిరు అభిమానులంతా.. ధ్రువ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. రేసుగుర్రం.. ఫేమ్.. సురేందర్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.
గీతా ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పోలీసు ఆఫీసర్గా నటిస్తున్నారు. ఎక్కువగా మైండ్ గేమ్తో నడిచే కథతో.. సురేందర్ రెడ్డి బాగా మలుస్తున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్గా చేస్తున్నాడు. దసరాకు ఈ చిత్రం విడుదల కానుంది.