శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (11:59 IST)

ఫిబ్రవరి 17న భారత్-పాకిస్థాన్ వార్ స్టార్ట్... రానా 'ఘాజీ' రిలీజ్

ఈనెల 17వ తేదీన భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య వార్ జరుగనుంది. వార్ అంటే.. నిజంగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కాదు. 1970లో జరిగిన భారత్-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఘాజీ. రానా, తాప్సీ, కె.కె.

ఈనెల 17వ తేదీన భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య వార్ జరుగనుంది. వార్ అంటే.. నిజంగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కాదు. 1970లో జరిగిన భారత్-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఘాజీ. రానా, తాప్సీ, కె.కె.మీనన్, అతుల్ కులకర్ణి ముఖ్యపాత్రల్లో నటించారు. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంకల్ప్ దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. 
 
ఈ చిత్రాన్ని ఈనెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇదే అశంపై నిర్మాతలు మాట్లాడుతూ యుద్ధ సన్నివేశాలు రొమాంచితంగా ఉంటాయనీ, ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ చిత్రం సాగుతుందని చెప్పారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది అన్నారు. ఓంపురి, నాజర్, రాహుల్‌సింగ్, మిలింద్ గునాజీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, మాటలు: గుణ్ణం గంగరాజు, నిర్మాతలు: అన్వేష్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నే, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంకల్ప్.