శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 7 ఆగస్టు 2018 (18:27 IST)

రాశీ ఖ‌న్నా బాగా క‌నెక్ట్ అయ్యింది

రాశీఖ‌న్నా న‌టించిన తాజా చిత్రం శ్రీనివాస క‌ళ్యాణం. నితిన్‌తో క‌లిసి న‌టించిన ఈ సినిమాకి శ‌త‌మానం భ‌వ‌తి ఫేమ్ వేగేశ్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన దిల్ రాజు నిర్మించారు. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిన

రాశీఖ‌న్నా న‌టించిన తాజా చిత్రం శ్రీనివాస క‌ళ్యాణం. నితిన్‌తో క‌లిసి న‌టించిన ఈ సినిమాకి శ‌త‌మానం భ‌వ‌తి ఫేమ్ వేగేశ్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన దిల్ రాజు నిర్మించారు. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ఈనెల 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను ఈ సినిమాపై ఫ‌స్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. ఇదిలాఉంటే... ఈ సినిమాకి రాశీఖ‌న్నా బాగా క‌నెక్ట్ అయ్యింది.
 
ఇంత‌కీ విష‌యం ఏంటంటే...తెలుగు పెళ్లిళ్లలో తలంబ్రాలు ఎందుకు పోస్తారు? బాసికం ఎందుకు కట్టుకుంటారు? తలపై జీలకర్ర బెల్లం ఎందుకు పెడుతారు.. తదితర విషయాలను శ్రీనివాస కళ్యాణం సినిమాతో తెలుసుకున్నానని రాశీ తెలిపింది. సినిమా చేస్తున్నంతసేపు తానూ ఓ తెలుగు అమ్మాయిలానే ఫీల్‌ అయ్యానని..భవిష్యత్తులో తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాశీ నవ్వుతూ చెప్పింది. 
 
ఒకవేళ తెలుగు అబ్బాయిని చేసుకోకపోయినా.. పెళ్లి ఇలా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నా. నాకు ఎప్పుడు పెళ్లి జరిగినా ఈ సినిమాను గుర్తు చేసుకోవడం మాత్రం ఖాయం అని రాశీ అంది. రాశీ మాట‌లు వింటుంటే బాగా క‌నెక్ట్ అయ్యిన‌ట్టు అనిపిస్తుంది. మ‌రి..ప్రేక్ష‌కులు ఏరేంజ్ స‌క్స‌స్ అందిస్తారో చూడాలి.