శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 8 జులై 2016 (14:41 IST)

ర‌ష్మి గౌత‌మ్‌ 'అంతం' అందాలు... ఫ‌స్ట్‌ డే రూ. 1.26 కోట్ల గ్రాస్ వసూళ్లు

'గుంటూరు టాకీస్ త‌రువాత రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ర‌ష్మి గౌతమ్ హీరోయిన్‌గా విడుద‌ల‌ైన చిత్రం 'అంతం'. ద‌ర్శ‌క‌నిర్మాత జి.ఎస్.ఎస్.పి కళ్యాణ్ అతిత‌క్కువ‌ బ‌డ్జెట్లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించారు. చరణ్ క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మించారు. 3

'గుంటూరు టాకీస్ త‌రువాత రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ర‌ష్మి గౌతమ్ హీరోయిన్‌గా విడుద‌ల‌ైన చిత్రం 'అంతం'. ద‌ర్శ‌క‌నిర్మాత జి.ఎస్.ఎస్.పి కళ్యాణ్ అతిత‌క్కువ‌ బ‌డ్జెట్లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించారు. చరణ్ క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మించారు. 300 థియేట‌ర్లకు పైగా ఆంద్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణా, క‌ర్ణాట‌క రాష్ట్రాలలో జూలై 7న విడుద‌ల చేశారు. విడ‌దల‌ైన అన్ని నగరాల్లో స్పీడ్ ఫుల్స్‌తో, టౌన్స్‌లో 90%  ఓపెనింగ్‌తో మొద‌టిరోజునే 1.26 కోట్ల గ్రాస్‌ని వ‌సూలు చేసి ఇండిపెండెంట్ చిన్న చిత్రాల్లో రికార్డుగా నిలిచింది. 
 
ఈ సందర్భంగా దర్శకనిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ మాట్లాడుతూ.... మా 'అంతం చిత్రం 300 థియేట‌ర్స్‌లో విడుద‌ల‌ై మొద‌టిరోజు రూ. 1.26 కోట్ల గ్రాస్ వ‌సూలు చేయడం చాలా ఆనందంగా వుంది. చాలా రీజ‌న్‌బుల్ రేట్స్‌కి మా డిస్ట్రిబ్యూట‌ర్స్‌కి ఇచ్చాము. వారంద‌రూ రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతాం అంటున్నారు. ఇండిపెండెంట్ చిన్న చిత్రాలు విడుద‌ల కావ‌టమే చాలా క‌ష్టంగా వున్న ఈరోజుల్లో మా చిత్రం విడుద‌ల ముందు బిజినెస్ కావ‌టం, గ్రాండ్ రిలీజ్ కావ‌టం. మెద‌టిరోజు రికార్డు క‌లెక్ష‌న్ రావ‌టం చాలా ఆనందంగా వుంది. గుంటూరు టాకీస్ చిత్రం త‌రువాత‌ రష్మీ గౌతమ్ న‌టించిన చిత్రం కావ‌టం, రంజాన్ ప‌ర్వ‌దినం కావ‌టం మా చిత్రానికి తెలుగు ప్రేక్ష‌కులు భారీ ఓపెనింగ్ ఇచ్చారు. వారంద‌రికి మాధ‌న్య‌వాదాలు అని అన్నారు.