శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 30 మే 2018 (21:27 IST)

వాళ్ల కోసం చావడానికైనా.. చంపడానికైనా రెడీ.. రేణూదేశాయ్

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ ట్విట్టర్‌లో ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. పవన్‌తో విడిపోయిన తరువాత పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి రేణూ పూణెలో ఉంటున్నారు. అయితే... పలు సందర్భాల్లో ఆమెలో ఉన్న ఎమోషన్

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ ట్విట్టర్‌లో ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. పవన్‌తో విడిపోయిన తరువాత పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి రేణూ పూణెలో ఉంటున్నారు. అయితే... పలు సందర్భాల్లో ఆమెలో ఉన్న ఎమోషన్స్‌ను.. పిల్లలతో కలిసి గడిపిన ఆనందాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటారు. తాజాగా రేణు దేశాయ్ పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ఇంత‌కీ ఏమ‌న్నారంటే... పిల్లలే సర్వస్వం అనుకుంటూ జీవితాన్ని గడుపుతున్న ఆమె.. వాళ్లపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఇద్దరి ఫోటోతో జతకలిసిన అద్భుతమైన కొటేషన్‌ను అభిమానులతో పంచుకున్నారు. తన ముద్దుల కుమార్తె ఆద్య నవ్వులు చిందిస్తూ ఉండగా.. అకిరా తన చెల్లెలిపై తలవాల్చి ఉండటాన్ని కెమెరాతో క్లిక్ మనిపించారు రేణు. 
 
ఈ ఫోటోను షేర్ చేస్తూ ‘ఒక హార్ట్, ఒక సోల్ (ఆత్మ).. మీ కోసం నేను ప్రాణాలు ఇస్తాను, మీ కోసం ప్రాణాలు తీస్తాను. ఓ తల్లి తన పిల్లల కోసం రాసిన చిన్న కవిత.. ఇలాంటి క్యూట్ పిక్స్ చాలానే ఉన్నాయి, ఎప్పటికీ అందిస్తూనే ఉంటా’ అంటూ ఎమోషనల్ మీనింగ్ వచ్చేలా ఈ కవిత రాశారు రేణూదేశాయ్. అదీ... సంగ‌తి.