శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By JSK
Last Modified: సోమవారం, 12 సెప్టెంబరు 2016 (13:39 IST)

తొక్కిస‌లాట‌లో చ‌నిపోయిన వెంక‌ట‌ ర‌మ‌ణ కుటుంబానికి ప‌వ‌న్ రూ.5 ల‌క్ష‌ల చెక్కు

హైద‌రాబాద్ : కాకినాడ‌లో జ‌న‌సేన స‌భ‌లో జ‌రిగిన తొక్కిసలాట‌లో మృతి చెందిన ఎన్. వెంక‌ట‌ ర‌మ‌ణ‌కు ప‌వ‌ర్ స్టార్ సాయం అందించారు. జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున వెంక‌ట ర‌మ‌ణ కుటుంబానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును అందించారు. బ‌హిరంగ సభ అనంత‌రం తిరిగి వెళుతుండ‌గా,

హైద‌రాబాద్ : కాకినాడ‌లో జ‌న‌సేన స‌భ‌లో జ‌రిగిన తొక్కిసలాట‌లో మృతి చెందిన ఎన్. వెంక‌ట‌ ర‌మ‌ణ‌కు ప‌వ‌ర్ స్టార్ సాయం అందించారు. జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున వెంక‌ట ర‌మ‌ణ కుటుంబానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును అందించారు. బ‌హిరంగ సభ అనంత‌రం తిరిగి వెళుతుండ‌గా, జ‌రిగిన తొక్కిస‌లాట‌లో వెంక‌ట ర‌మ‌ణ మృతి చెందాడు. మ‌రికొంత మంది గాయ‌ప‌డ్డారు. 
 
వెంక‌ట ర‌మ‌ణ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు తను వ‌ద్దామ‌నుకున్నాన‌ని, అయితే భ‌ద్ర‌త దృష్ట్యా పోలీసులు వ‌ద్ద‌ని చెప్ప‌డంతో వీలుకాలేద‌న్నారు. అభిమాని మృతిపై తాను తీవ్ర మ‌న‌స్థాపం చెందాన‌ని ప‌వ‌న్ చెప్పారు. త‌న త‌ర‌ఫున జ‌న‌సేన ప్ర‌తినిధులు మృతుడి కుటుంబానికి ఆర్ధిక స‌హాయం అందించార‌ని చెప్పారు. గాయ‌ప‌డిన‌ వారికి కూడా చికిత్స అందిస్తున్నామ‌ని జ‌న‌సేన అధినేత తెలిపారు.