శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (14:31 IST)

మెగా కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ మూవీ

సెన్సేషనల్ దర్శకుడు ఎస్. శంకర్‌, మెగాస్టా్ చిరంజీవి కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ మూవీ రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన సొంత నిర్మాణ సంస్త గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్నారు. 
 
రాజకీయాలకు స్వస్తి చెప్పి సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి నటించిన చిత్రం "ఖైదీ నంబర్ 150". అపుడే చిరంజీవితో తన బ్యానర్లో ఒక భారీ బడ్జెట్ చిత్రం ఉంటుందని అల్లు అరవింద్ ప్రకటించారు. అయితే వరుసగా చిరంజీవి సినిమాలకి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఇక అల్లు అరవింద్ బ్యానర్లో చిరంజీవి సినిమా ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు ఉందనీ.. ఈ సినిమాకి భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడనేది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. తెలుగు.. తమిళ భాషల్లో రూపొందే ఒక సినిమా కోసం కథను సిద్ధం చేయమని అల్లు అరవింద్.. శంకర్‌ని కోరారట. 
 
తెలుగులో చిరంజీవి కథానాయకుడైతే, తమిళంలో అజిత్ లేదా విజయ్‌తో గాని ఈ ప్రాజెక్టు చేసేలా మాటలు జరిగాయని చెబుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' చేస్తున్నారు. ఆ తర్వాత కొరటాల, త్రివిక్రమ్ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఇక శంకర్ విషయానికొస్తే 'భారతీయుడు 2' పనులతో బిజీగా వున్నాడు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత శంకర్ - చిరంజీవి ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది.